Friday 19 October 2012

తెలంగాణా మీడియాపై వివక్ష?

మొన్న ప్రధాని మన్‌మోహన్ సింగ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కేవలం తెలంగాణ పత్రిక ప్రతినిధులనే రాకుండా అడ్డుకోవడం నిజంగా అందరూ ఖండించ వలసిన విశయమే. దేశానికి ప్రధాన మంత్రై ఉండి అందరినీ సమానంగా చూడాల్సిన వ్యక్తి కేవలం కొందరినే చేరదీయడం బాదాకరమైనదే. ఇది తెలంగాణ మీడియాపై ప్రత్యక్షంగా కనబడ్డ వివక్ష. కానీ ఈ సంఘటను అన్ని తెలుగు పత్రికలు వ్యతిరేకించాలి అని తెలంగాణ పత్రికలు కోరడం మాత్రం సరైనదా అనిపిస్తుంది.

తెలంగాణలో సీమాంధ్ర మీడియాపై వివక్ష లేదా అంటే ఎందుకు లేదు. బోలెడంత ఉంది. ఐతే అది ప్రజల్లో ఉంది. వీడు మనోడు కాదు. వీన్ని నమ్ముకుంటే నిండా ముంచుతాడు, వీడి చానల్లో, పేపర్లో వార్తలన్నీ పచ్చి అబద్ధాలు అని కొన్ని పేపర్ల గురించి, కొన్ని చానల్ల గురించి ప్రజలు భావించడం, సభలు, సమావేశాలు జరిగినప్పుడు ఇటువంటి అర్థం వచ్చేలా బ్యానర్లు కట్టడం కూడా గమనించ వచ్చు.  దీన్ని ఎన్నడూ ఏ పత్రిక తప్పు అని చెప్పలేదు. ఎందుకంటే ఇది ప్రజాభిప్రాయం.

ఇది శృతిమించి కొన్ని సమయాల్లో సీమాంధ్ర మీడియా వాహనాలు తగలబెట్టినప్పుడు మీడియా ప్రతినిధులంతా ధర్నాలు చేసిన దఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది దాన్ని నిలదీయడానికి మీరూ రండి అని వీళ్ళను తోడు రమ్మంటే ఎలా వస్తారు. రారు కదా, మంచిగైందని ముడుచుకు కూర్చుంటారు.

వీళ్ల తోడు అడగక పోవడమే మంచిది.


ఒక వేళ వీళ్లకు ప్రధానిని కలిసే అవకాశం వచ్చినా, పార్లమెంటులో విపక్షాల ప్రశ్నలకు మేడం అనుమతి లేకుండా నోరు తెరువని వాడు వీళ్లు అడిగే ప్రశ్నలకు తను నోరు విప్పేవాడా ఆంటే అనుమానమే.